‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నది ప్రమోషన్ కార్యక్రమాలు చిత్ర యూనిట్ జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఓ రేంజ్లో విడుదలైన చిత్ర టీజర్, సాంగ్స్ ఉన్నాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కోసం భారీ ఏర్పాట్లు చేయాలని, టాలీవుడ్కు చెందిన మరో అగ్ర హీరోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వచ్చాయి. దీనిలో భాగంగా సినీ అభిమానులు ఈవెంట్ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాండ్ మార్క్ అనౌన్స్మెంట్కు సిద్ధంకండి అంటూ సోషల్ మీడియా పేజ్లో ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఈ అనౌన్స్మెంట్ మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ ప్రకటన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్న ముఖ్య అతిథి గురించే అయ్యుంటుందని.. రామ్ చరణ్ అతిథిగా ఫంక్షన్కు రానున్నారని అభిమానులంతా ఊహించారు. కానీ మహేష్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్న అతిథి ఎవరో అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి జనవరి 5న జరగనున్న వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నట్లు మహేష్ బాబు కన్ఫర్మ్ చేశారు.అభిమానులతో ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చేందుకు అంగీకరించిన చిరంజీవి గారికి ధన్యవాధాలు. మీరు విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపు అయ్యింది. మిమ్మల్ని కలవడానికి ఎంతోగానో ఎదురు చూస్తున్నా’’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.