నేడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజు పండగే సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. యువ దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ వంటి అన్ని అంశాలు సమపాళ్లలో కుదరడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సినిమా తీసాడని అంటున్నారు ప్రేక్షకులు.
ఇక ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ ఎంతో బాగా నటించినప్పటికీ కొన్ని సీన్స్ లో మాత్రం అతడికి నటనలో మరింత పరిణితి అవసరం అని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విన్నర్, ఇంటిలిజెంట్ లాంటి యాక్షన్ సినిమాలు, చిత్రలహరి లాంటి క్లాస్ సినిమాలు సహా, తాజాగా ఈ ప్రతిరోజు పండగే సినిమా అయినా కూడా అన్ని సినిమాల్లో సాయి సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడని, సినిమాల సంగతి ఎలా ఉన్నా లవ్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్ విషయంలో ఎక్స్ప్రెషన్స్ సేమ్ గా ఉంటున్నాయి తప్ప వాటిలో ఏ మాత్రం వైవిద్యం ఉండడం లేదని అంటున్నారు.
నిజానికి ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ పాత్రను మారుతి అండర్ ప్లే చేశాడు. పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తుంది కానీ, అతను తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఈ పాత్ర పెద్దగా ఇవ్వలేదు. పతాక సన్నివేశంలో మినహా చాలా సన్నివేశాల్లో తేజు మామూలుగా అనిపిస్తాడు. ఇక ఓవర్ అల్ గా అన్ని అంశాలు ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ సినిమా రేపటి నుండి మంచి టాక్ మరియు కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తానికి ఈ సినిమాతో తేజు ఖాతాలో మరొక హిట్ వచ్చి చేరింది....!!