టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రాధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. అయితే క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాదు ఇటు కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 90శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు జక్కన్న.

 

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఈ మూవీ షూటింగ్‌కు కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ.. తర్వాత రాజ‌మౌళి ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా ముందుకు తీసుకెళ్ళారు.  ఈ క్రమంలో ఓసారి ఎన్టీఆర్‌పై, మరోసారి చరణ్‌పై, ఆ మధ్యలో ఇద్దరిపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే  ఈ మూవీ పై ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటించే ఏ హీరో.. ఆ మూవీ పూర్తయ్యేవరకు బయట పెద్దగా కనిపించడు. అయితే చెర్రీ మాత్రం విరివిగా ఫ్యాన్స్‌కు కనిపిస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌లు లీక్ అవ్వడం తప్ప.. ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఈ మూవీలో అసలు చెర్రీ పాత్ర నిడివి త‌క్కువేమో అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దానికి తోడు అతడి లుక్‌‌ కూడా సాధారణంగా ఉండటంతో.. ఆర్ఆర్ఆర్‌లో చెర్రీ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదా..! అని వారు వర్రీ అవుతున్నారు.

 

అయితే సినిమా ప్రారంభమైన సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ఈ మూవీలో ఇద్దరికి సమాన పాత్ర ఉంటుందని  ఏ ఒక్క‌రికీ ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండా చూసుకుంటాన‌ని పేర్కొన్న విషయం తెలిసిందే. మరి అసలు ‘ఆర్ఆర్ఆర్‌’లో చెర్రీ పాత్ర ఎలా ఉండబోతోంది..? చెర్రీ, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి ఎలా తీర్చిదిద్దాడు..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇంత భారీ చిత్రంల పైగా ఇద్ద‌రు సూప‌ర్ స్లార్లు న‌టిస్తుండ‌గా ఎవ్వ‌రినీ త‌క్కువ చేసిన ఫ్యాన్స్‌లో గొడ‌వ మాములుగా ఉండ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: