టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్ కూడా సినిమాపై అంచనాలు మరింతగా పెంచడంతో, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత అందరి అంచనాలు తమ సినిమా అందుకుని తీరుతుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాన్ లెవెల్లో జరుగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వేడుకకు విశేష అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విచ్చేయనున్నట్లు సరిలేరు యూనిట్ కాసేపటి క్రితం ఒక అనౌన్స్ మెంట్ రిలీజ్ చేసింది. దానితో పాటు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజులు కలిసి వెళ్లి మెగాస్టార్ ను ప్రత్యేకంగా ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్న ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక తమ ఆహ్వానం మేరకు మెగాస్టార్ ఈ ఫంక్షన్ కు విచేస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని, 

 

అలానే ఆయనకు తామందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. కాగా మహేష్ బాబు ట్వీట్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎప్పుడూ పెద్దలను గౌరవించడంలో ముందుంటారనేది ఆయన ప్రస్తుతం చేసిన ట్వీట్ ద్వారా మరొక్కసారి తేటతెల్లం అయిందని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: