ఆరు వరుస డిజాస్టర్ల తరువాత ఈఏడాది సమ్మర్ లో చిత్రలహరి తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎట్టకేలకు  డీసెంట్  హిట్ కొట్టాడు మెగా హీరో  సాయి తేజ్. ఇక ఈ చిత్రం తరువాత అతను మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో  ప్రతిరోజూ పండగే  లోనటించాడు.  నిన్న విడుదలైన  ఈ చిత్రం యావరేజ్  రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఇక  మొదటి రోజు  ఈచిత్రం  కలెక్షన్ల పరంగా  షాక్ ఇచ్చింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా కేవలం 3కోట్ల షేర్ ను మాత్రమే  రాబట్టగలిగింది.  అయితే టాక్  పాజిటివ్ గా వుండండతో  ఈ రోజు ర, రేపు మొదటి రోజు  కన్నా  ఎక్కువ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశాలు వున్నాయి.  ముఖ్యంగా మార్నింగ్ షోస్  ఫుల్ కాకపోవడమే   ఓపెనింగ్  తక్కువ రావడానికి కారణంగా కనిపిస్తుంది. ఇక  ఈ చిత్రం  ఓవర్సీస్ లో మాత్రం  డీసెంట్ వసూళ్లను  రాబడుతుందని సమాచారం. 
 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  ఫస్ట్  హాఫ్  హైలైట్ అవ్వగా   యావరేజ్ సెకండ్  హాఫ్   సినిమా ఫలితం పై ప్రభావం చూపించనుంది.  ఈచిత్రం లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.   యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2  సంస్థలు  నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక  సాయి ధరమ్ ప్రస్తుతం  నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో  సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు.   రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాభ నటేష్  హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న  ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: