పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ హైలైట్ అవ్వగా యావరేజ్ సెకండ్ హాఫ్ సినిమా ఫలితం పై ప్రభావం చూపించనుంది. ఈచిత్రం లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక సాయి ధరమ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభ నటేష్
హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్
ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.