ఈ మద్య సినిమాలు అంటే హీరో హీరోయిన్ల ముద్దు సీన్లు, రొమాంటిక్ సాంగ్స్, నాలుగు ఫైట్లు సినిమా క్లోజ్.  ఇలాంటి మూసపద్దతుల్లో అప్పుడప్పుడు కొన్ని సామాజిక కోణంలో వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కంటెంట్ తక్కువ ఎక్స్ పోజింగ్ ఎక్కువగా ఉన్న సినిమాలు వస్తున్నాయి.  అలాంటి సినిమాలు ఎవో ఒకటీ రెండు తప్ప కంటికి కూడా కనిపించని విధంగా థియేటర్లో రావడం..పోవడం జరుగుతుంది.  అర్జున్ రెడ్డి మూవీలో లిప్ లాక్ సీన్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీలో లవ్ యాంగిల్ కి అభిమానులు బాగా కనెక్ట్ కావడంతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత విజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ రొమాంటిక్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే.. పోస్టర్స్ పచ్చి బూతులు తలపించాయి.  కానీ ఈ సినిమా కూడా లవ్ ట్రాక్ తో సూపర్ సక్సెస్ అయ్యింది.

 

తాజాగా ఎక్స్ పోజింగ్ గురించి నటి లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ మూవీలో నటించిన విషయం తెలిసందే. అందాల రాక్షసితో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ అమ్మడు నటించిన మూవీస్ బిగ్గెస్ట్ హిట్స్ కాలేదు.  ఆ మద్య నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ మంచి సక్సెస్ అందుకుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు 'ఏ1ఎక్స్ ప్రెస్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో లావణ్య హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనుందట.

 

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆడియన్స్ హీరోయిన్స్ ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అంతగా చూసి ఆశపడేవారని.. కానీ ఇప్పుడు యూత్ అలా లేరని గ్లామర్ ఎంతగా ఇష్టపడతారో.. హీరోయిన్ నటనను అంతే ఇష్టపడుతున్నారు. దీనికి కారణం గతకొంత కాలంగా సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత అభిస్తుంది. దాన్ని బట్టే హీరోయిన్లు నటన పరంగా మెప్పించాలని తెలుస్తుందని అన్నారు లావణ్య త్రిపాఠి.

మరింత సమాచారం తెలుసుకోండి: