పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో బ్లాక్ బస్టర్ కొట్టి.. తమిళంలోనూ సూపర్ హిట్ ని సాధించిన పింక్ రీమేక్ లో నటించేందుకు పవన్ అంగీకరించారు. నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఈ సినిమా ఇంతకుముందు లాంఛనంగా ప్రారంభమైంది. పింక్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన వివరాలు ఇటీవల వెల్లడించారు. అయితే ఈ సినిమాలో కథానాయికలు ఎవరెవరు? అన్న విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

 

ఇంతకుముందు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. క్రేజీ మలయాళీ బ్యూటీ నివేదా థామస్ ను ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అలాగే తెలుగమ్మాయి అంజలికి వేరొక కీలక పాత్రలో అవకాశం ఇచ్చారని ప్రచారమైంది. మరో కీలక నాయికగా పింక్ ఒరిజినల్ లో నటించిన తాప్సీనే ఎంపిక చేయాలని భావించినట్టు ప్రచారమైంది. అయితే తాప్సీ స్థానంలో ఇంకొక హీరోయిన్ పేరు తాజాగా తెరమీదకొచ్చింది. మల్లేశం సినిమాలో నటించిన అనన్యను ఫైనల్ చేశారని వార్తలొచ్చాయి. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు సినిమాలలో బిజీ అవుతోంది.

 

ఈ ముగ్గురు హీరోయిన్స్ ఫోటోలు ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా పవన్ తో పాటుగా ఆ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో చేర్చిన ఫోటో అంతర్జాలంలో వేడెక్కిస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులు ట్విట్టర్.. ఇన్ స్టా ఖాతాల్లో ఈ ఫోటోని వైరల్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ శరవేగంగా పూర్తవుతోంది. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ ట్యూన్స్ ని రెడీ చేస్తున్నారు. వేణూ శ్రీరామ్ స్క్రిప్టు ఆద్యంతం రెడీ చేసి.. మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయ్యారు. ఇక ఈ సినిమాకి బోనికపూర్ కూడా భాగస్వామి అవడం విశేషం.  ఇక ఈ సినిమాలో నటించే ముగ్గు హీరోయిన్స్ రెడీ అయ్యారు గాని అసలు కథానాయకుడు రెడీనా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి దీని పై హీరో పవన్ కళ్యాణ్ త్వరగా క్లారిటి ఇస్తే బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: