బాలీవుడ్ స్టార్
హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్
మూవీ దబంగ్ 3 నిన్న విడుదలై పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. సూపర్ హిట్ సిరీస్ దబంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఓవర్ యాక్షన్ తప్ప విషయం లేదనే క్రిటిక్స్ తేల్చేశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలకావడంతో ఈ చిత్రం భారీ ఓపెనింగ్ ను రాబట్టుకోవడం ఖాయం అనుకున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు కానీ వారికి షాక్ ఇస్తూ ఈచిత్రం నార్త్ ఇండియాలో కేవలం 20కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి తీవ్రంగా నిరాశపరించింది. ఈ కలెక్షన్స్
సౌత్ స్టార్ హీరో
ప్రభాస్ నటించిన
సాహో కన్నా తక్కువ కావడం గమనార్హం.
సాహో హిందీ వెర్షన్ మొదటి రోజు 24కోట్ల షేర్ ను రాబట్టి సత్తా చాటింది. దాంతో అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న
సల్మాన్ ఖాన్ , ప్రభాస్ క్రేజ్ ముందు డీలా పడ్డాడు.
ఇక ఈ చిత్రం
హిందీ తోపాటు తెలుగు ,
తమిళ భాషల్లో కూడా విడుదలైయింది. విడుదలకు ముందు ప్రమోషన్స్ అంటూ హడావుడి చేసిన
సౌత్ లో ఈ చిత్రాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. దాంతో ఈ రెండు వెర్షన్లు కలుపుకొని 2కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తెరకెక్కించిన ఈచిత్రంలో
సోనాక్షి సిన్హా
హీరోయిన్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు
మహేష్ మంజ్రేకర్ చిన్న కుమార్తె సయి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ,
అర్బాజ్ ఖాన్ నిర్మించారు. ఇక ఈ ఏడాది ఈసినిమా
కన్నా ముందు
భారత్ తో ప్రేక్షకులముందుకు వచ్చిన
సల్మాన్ ఖాన్ కు ఆ
సినిమా కూడా భారీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు
దబాంగ్ 3కూడా అదే బాటలో పయనిస్తుంది.