తెలుగు సినిమా పరిశ్రమలో అందానికి నిర్వచనం అంటే తమన్నా పేరు వినపడుతుంది. మహేష్ బాబు అన్నట్లు సినీ ఇండస్ట్రీలో తమన్నకన్నా తెల్లగా ఎవరు లేరమ్మా అన్న విషయం నిజామే కదా.. ఈ ముద్దు గుమ్మా శ్రీ చిత్రం తో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హ్యాపీడేస్ చిత్రంతో బాగా ఫెమస్ అయింది. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటిస్తూ  వస్తుంది. అలా ఎన్నో సినిమాలలో నటిస్తుంది. 


బాహుబలి సినిమాలో  నటించి మంచి గుర్తింపు  తెచ్చుకుంది తమన్నా.. ప్రపంచ స్థాయి రేంజులో  సెలెబ్రెటీగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అందుకే యూనివెర్సల్ బ్యూటీ గా మంచి పేరు తెచ్చుకుంది. సూపర్ టాలెంటెడ్ తమన్నా ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని తమన్నాకు సంబంధించిన ఓ కత్తిలాంటి పోస్టర్‌ను సినిమా టీం అభిమానుల కోసం వదిలింది. 

 

ఆ సినిమాలో ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ తన హాట్ ఫిగర్‌తో పిచ్చెక్కించేస్తోంది. ఈ సినిమాలో తమన్నా మహేష్ బాబుతో కలిసి ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాట.. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం.ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పాటను షూట్ చేశారట. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారట. 


కాగా వచ్చే ఏడాది 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ప్రీ రిలీజ్ వేడుక మెగా సూపర్ ఈవెంట్ కానుంది.జనవరి 5 న ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: