రైటర్ గా ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలను అందించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. త్రివిక్రం మాటలు వెంకటేష్ నటన ఆయా సినిమాలకు స్పెషల్ క్రేజ్ తెచ్చాయి. అయితే డైరక్టర్ గా మారాక మాత్రం ఈ ఇద్దరు ఇప్పటివరకు కలిసి పనిచేసింది లేదు. ఒకటి రెండు సార్లు సినిమా ఎనౌన్స్ చేసి మరి ఎందుకో వెనక్కి తగ్గారు. రెండేళ్ల క్రితం వెంకటేష్ బర్త్ డే రోజు హారిక హాసిని క్రియేషన్స్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ చేశారు. కాని ఆ సినిమా ఏమైందో ఎవరికి తెలియదు.

 

ఇదిలాఉంటే త్రివిక్రం ఇప్పుడప్పుడే వెంకటేష్ తో సినిమా చేసే ఆలోచనలో లేడని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో చేస్తున్న అల వైకుంఠపురములో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్, రాం చరణ్ లతో త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. వెంకటేష్ తో సినిమా కోసం త్రివిక్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఫిల్మ్ నగర్ టాక్.

 

సీనియర్ స్టార్ హీరోలతో చేస్తే పెద్దగా వర్క్ అవుట్ అవదని అనుకున్నాడో ఏమో కాని వెంకటేష్ సినిమా అంటే త్రివిక్రం వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది. ఇక వెంకటేష్ విషయానికి వస్తే కొన్నాళ్లుగా సీరియస్ కథలు చేస్తూ తనని అభిమానించే మహిళా ప్రేక్షకులకు దూరమైన వెంకటేష్ ఈ ఇయర్ మొదట్లో వచ్చిన ఎఫ్-2.. రీసెంట్ గా వచ్చిన వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 

సినిమా ఫలితాలు వెంకటేష్ కు మంచి జోష్ ఇచ్చాయి. ప్రస్తుతం వెంకీమామ హిట్ జోష్ లో ఉన్న వెంకీ తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని రీమేక్ చేస్తున్నాడట. ఈ సినిమా తర్వాత వెంకటేష్ సినిమా ఏంటన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వెంకటేష్, త్రివిక్రం కాంబో సినిమా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇంకా కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: