ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో వరుసబెట్టి సినిమాలు చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ముకుంద సినిమా తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత బన్నీతో దువ్వాడ జగన్నాథం సినిమా చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం సమంత మరియు ఇంకా వేరే హీరోయిన్ లకు ఎక్కువగా సినిమాలు లేకపోవడంతో పూజా హెగ్డే దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్...పూజా హెగ్డే స్పీడ్ కి అడ్డుకట్ట వేయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి పక్కన నటించిన ఆలియా భట్ తాజాగా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా 'RRR' లో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

 

ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఆలియా భట్ rrr సినిమా విడుదల కాకముందే మరో అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో అలియా ఓ కీ రోల్ లో నటించేందుకు సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. క్షణం, గూఢచారి, అమీ తుమీ, ఎవరు లాంటి సినిమాలతో సైలంట్ గా హిట్స్ అందుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ను సోని పిక్చర్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.

 

26/11 ముంబై దాడుల నేపథ్యంలో వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే కి ఆలియాభట్ ఎంట్రీ ఇవ్వటంతో చాలా వరకు అవకాశాలు ఆలియా భట్ కి వస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదే తరుణంలో తెలుగులో మరికొంతమంది టాప్ హీరోయిన్లకు కూడా ఆలియా భట్ సౌత్ ఎంట్రీ షాకింగే అని చెప్పవచ్చు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: