టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కలయికలో మొన్న జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వెంకటేష్, తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ కూడా మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడంతో, ఈ ఏడాది వెంకటేష్ నటించిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇకపోతే వీటి తరువాత వెంకటేష్, తమిళ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటించనున్నారు. ఇటీవల ధనుష్ హీరోగా వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ సినిమా, తమిళ్ లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. కాగా ఆ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ వారు, 

 

ఒరిజినల్ మాతృకను నిర్మించిన వి క్రియేషన్స్ తో కలిసి తెలుగులో వెంకటేష్ తో ఆ సినిమాను నిర్మించనున్నారు. ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ నటించనుందని నేడు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం సినిమా యూనిట్ ఆమెను కలిసి కథను వినిపించడం జరిగిందని, 

 

కథ విన్న కాజల్ తాను నటించడానికి సిద్ధం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. గతంలో అబ్బాయి రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన కాజల్, ఈసారి ఏకంగా బాబాయి వెంకీతో కూడా నటించబోతుండడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. వాస్తవానికి తమిళ అసురన్ లో హీరోయిన్ గా మంజు వారియర్ నటించి మెప్పించింది. మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఆ పాత్ర, చాలావరకు డీ గ్లామర్ రోల్ కావడంతో, ఆ క్యారెక్టర్ తన కెరీర్ కు మరింత హెల్ప్ అవుతుందని భావించి కాజల్ ఒప్పుకుందని సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: