శృంగార తార సన్నీ లియోన్ గురించి 15 ఏళ్ళ పిల్లల దగ్గర్నుంచి రేపో మాపో పోయో వాళ్ళదాకా ఎవరైన చెప్పేస్తారు. అయితే పోర్న్ మువీస్ చేసిన సన్ని కంప్లీట్ గా ఆ సినిమాలను చేయూడం ఆపేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలలో..ఐటం సాంగ్స్ లో నటిస్తూ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయినా సన్నీ ఫాలోయింగ్ డబుల్ అయింది తప్ప తగ్గలేదు. ఇక తెలుగులోను సన్నీ నటించడం నర్తించడం తెలిసిందే. ఇక ఆల్ట్ బాలాజీ సంస్థ నుంచి ఓ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ తెరకెక్కుతున్నాయంటే దానిపై యూత్ లో ప్రత్యేక చర్చ సాగుతుంటుంది. రొమాన్స్.. హారర్ థ్రిల్లర్.. ఎరోటిక్ థ్రిల్లర్ అంటూ రకరకాల జోనర్లను ఎంచుకుని తెరనిండుగా అందాల్ని ఆరబోయడం.. భయపెట్టడం.. వేడెక్కించడం అనే ఫార్ములాతో వందల కోట్ల వ్యాపారం చేస్తోంది ఈ సంస్థ. ఏక్తా కపూర్ సారథ్యంలో ఆల్ట్ బాలాజీ ఇప్పటికే విజయవంతమైన సంస్థగా ఎంతో పాపులరైంది.


 
రాగిణి ఎంఎంఎస్ సినిమాల తర్వాత ఈ బ్యానర్ లోనే రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ఎరోటిక్ వెబ్ సిరీస్ వేడెక్కించిన సంగతి తెలిసిందే. అంతా కొత్త కుర్రాళ్లతో లైవ్ స్ట్రీమింగ్ లో అగ్గి రాజేశారు. తొలి సీజన్ యూత్ కి బాగా కనెక్టయ్యింది. ఇప్పుడు సీజన్ 2కి రంగం సిద్దమయింది. వరుణ్ సూద్ - దివ్య అగర్వాల్ తదితర తారాగణంతో రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ త్వరలో జీ5లో స్ట్రీమింగుకి రాబోతోంది. దీంతో అందరు ఎప్పుడెప్పుడా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

ఈ సిరీస్ లో ఆత్మలు దెయ్యాలు.. సెక్స్.. రొమాన్స్ అంటూ చాలానే వేడెక్కించే కంటెంట్ ఉంటుందిట. అసలు మీరు ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? అంటూ సన్నీ తాజా ప్రమోషనల్ వీడియోలో ప్రమోట్ చేస్తోంది. అన్నట్టు మరీ ఇంత అగ్గి రాజేసే విజువల్స్ తో ముందుకొస్తున్నాం అని ఓపెన్ గా చెబుతున్నారు కదా! దీనిపై సెన్సార్ ఏదీ ఉండదా? అంటే.. వెబ్ కంటెంట్ కి సెన్సార్ చేయలేమని.. ఓటీటీ వేదిక స్వేచ్ఛకు భంగం కలగనిచ్చే ఆలోచన ఏదీ లేదని ఇంతకుముందు సీబీఎఫ్ సీ - అంతర్జాల విభాగం.. కేంద్ర మంత్యివర్యులు సంయుక్త ప్రకటన వెలువరించారు. దాంతో ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తు యూత్ తెగ టెంటింగ్ గా ఉన్నారు. ఇక సన్నీ అంటే యూత్ నిద్ర కూడా పోరన్న సంగతి అందరికి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: