సింగం 1&2  తరువాత  తమిళ స్టార్ హీరో సూర్య కు  సరైన  బ్లాక్ బాస్టర్  మూవీ తగిలి  కొన్నేళ్లు  దాటి పోయింది.  మధ్యలో  24, సింగం 3,గ్యాంగ్ ,ఎన్ జి కె , కప్పాన్ ఇలా వరుస సినిమాలతో  పలకరించిన  ఇందులో  24, కప్పాన్ , మాత్రమే  పర్వాలేదనిపించాయి.  దాంతో  సూర్య కెరీర్ గ్రాఫ్  బాగా  పడిపోయింది . తెలుగులో అయితే సూర్య మార్కెట్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.  ఇలానే చేసుకుంటే  పోతే  కోలీవుడ్ లో విక్రమ్ పరిస్థితిలా తయారవ్వడం  ఖాయం.  అయితే ఆ పరిస్థితి రాకముందే  సూర్య మేల్కొంటున్నాడు. 
 
 
బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చిన  దర్శకులతోనో  తన తదుపరి సినిమాలకు  కమిట్ అవుతున్నాడు. అందులో  భాగంగా   ఈఏడాది  సంక్రాంతికి  కోలీవుడ్ కు విశ్వాసంతో  బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన  శివ డైరెక్షన్ ల్లో తన 39వ చిత్రంలో నటించనున్నాడు.  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్  పతాకంపై  కేఈ జ్ఙానవేల్ రాజా నిర్మించనున్నాడు.  ఈ చిత్రంలో  సూర్య కు జోడిగా కాజల్ నటించనుందని సమాచారం. ఇక ఈ చిత్రం తరువాత సూర్య  తన 40 వచిత్రాన్ని ఇటీవల అసురన్ తో   బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్  వెట్రిమారన్ తో  చేయనున్నాడని  కొద్దీ సేపటి క్రితం అధికారిక ప్రకటన వెలుబడింది.   వి క్రియేషన్స్  పతాకం పై కలై పులి ఎస్ తాను  ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.  వచ్చే ఏడాది  సమ్మర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఇక సూర్య ప్రస్తుతం  'గురు' ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో  'సురరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో  సూర్య కు జోడిగా అపర్ణ బాలమురళి  నటిస్తుండగా  ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.  జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్   లో విడుదలకానుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: