ప్రస్తుత తెలుగు సినిమా ప్రపంచంలో జాగ్రత్తగా వ్యవహరించే నిర్మాతలు చాలా తక్కువగా ఉన్నారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి చేతులు కాల్చుకోరు. అలాంటి కోవకే చెందుతారు దిల్ రాజు  . నితిన్ నటించిన దిల్ సినిమాతో నిర్మాతగా మారిన రాజు ఆ సినిమాతో తన పేరును దిల్ రాజు గా మార్చుకుని స్థాయిలో హిట్ కొట్టారు. ఇక అప్పటినుంచి మంచి మంచి సినిమాలు తీస్తూ మంచి ట్రాక్ రికార్డ్ తో ముందుకు వెళ్తున్నారు.

 

 ఎన్ని సినిమాలు నిర్మించిన తనను సినిమా లో నిలబెట్టిన డిస్ట్రిబ్యూటర్ ని మాత్రం మర్చిపోలేదు. ఆయన నైజాంలో ఏ పెద్ద హీరో సినిమా అయినా దాదాపు దిల్ రాజు తర్వాతనే వేరే వాళ్ళకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి దిల్ రాజు ఇప్పుడు తన కెరీర్లోనే అతిపెద్ద రిస్కు చేస్తున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నుంచి తిరిగి సినిమాల్లోకి అడుగు పెడుతున్న సమయంలో తొలి చిత్రాన్ని తన పై వేసుకున్నాడు దిల్ రాజు.

 

ఈ సినిమాకి దాదాపు 40 కోట్ల పారితోషికాన్ని పవన్ కళ్యాణ్ అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ కేవలం 21 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తోంది. దీని ప్రకారం దాదాపు ఒక రోజుకి పవన్ కళ్యాణ్ సంపాదన 2 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అసలు చాలా రోజులు నుంచి తెరకు దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ కి నిజంగా అంత మార్కెట్ ఉందా అంత బడ్జెట్ ఆయనపై పెట్టడం సబబేనా అని ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి.  

 

బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన బదలా అనే సినిమాను రీమేక్ తెలుగులో తీస్తున్నారు. గతంలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ కి సరిగ్గా రాలేదు అని ప్రచారం కూడా ఉంది. మరి ఇప్పుడు అలాగే చేయడని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతోనే దిల్ రాజు ఈ రిస్కు చేస్తున్నాడని సినిమా జనాలు అనుకుంటున్నారు. చూడాలి మరి దిల్ రాజు నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెడతారో లేదో .

మరింత సమాచారం తెలుసుకోండి: