మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది  సమంత. అక్కినేని కోడలిగా మారి  నాగచైతన్య ను  పెళ్లి చేసుకున్న తర్వాత ఆ క్రేజ్ ఇంకా ఎక్కడికొ  వెళ్ళిపోయింది. అయితే వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం ది ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇకపోతే అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించడం కొత్తేమి కాదు. మంచి కథలు వస్తే చాలు అందరూ కలిసి నటించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇప్పటికే అక్కినేని జనరేషన్ మొత్తం కలిసి నటించిన సినిమా మనం ప్రేక్షకులను ఎంతగా అలరించి ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమంత నాగ చైతన్య తో పాటు నాగార్జున తో కూడా కలిసి నటించారు. 

 

 

 అయితే తాజాగా తన మరిది అఖిల్ తో కలిసి కూడా సమంత నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అఖిల్ నటించబోతున్న సినిమాలో అతిథి పాత్రలో నటించబోతోందట  సమంత. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు వచ్చేసినట్లు సమాచారం. ఇకపోతే బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ తన కథను మొదట్లో ఓ లేడీ స్కూటీ ఎక్కి చెబుతూ ఉంటారు.. అలా కథ మొదలవుతుంది. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా అలాంటి సిన్  పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడట అయితే... ఈ చిత్రంలో అఖిల్ తన కథను సమంతకు చెబుతారని ప్రచారం జరుగుతోంది.. 

 

 

 సినిమా మొదలవగానే అఖిల్ సమంతకు కథ చెబుతుంటే ఆమె కోణంలో సినిమా మొదలవుతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు భాస్కర్ అఖిల్ సినిమాను కూడా అలాగే డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న సినిమా 2020 సమ్మర్లో విడుదల కానున్నట్లు సమాచారం . ఇకపోతే సమంత అటు బిజీ షెడ్యుల్ ని గడుపుతుంది. ఇప్పటికే ఈ ఏడాది మచిలీ ఓ బేబీ సినిమాలతో మంచి విషయాలను తన ఖాతాలో వేసుకుంది సమంత. ఇప్పుడు ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో ఓ నెగిటివ్ రోల్ లో నటించేందుకు సిద్ధమైంది. ఇక మరోవైపు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: