తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఉన్నారు.  హీరోలు, ద‌ర్శ‌కులు మ‌రియు నిర్మాత‌ల త‌న‌యులు కూడా ఇప్పుడు హీరోల‌వుతున్నారు. అయితే అందులో కొంద‌రు ఫుల్ స‌క్సెస్‌తో ర‌న్ అవుతుంటే.. కొంద‌రు మాత్రం వెనుకంజులోనే ఉంటున్నారు. ఇందులో ముఖ్యంగా  అక్కినేని మూడో త‌రం అఖిల్ అక్కినేని. అఖిల్‌ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆకట్టుకునే అందం, ఫిజిక్, నటన ఉన్నా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కినేని అఖిల్‌ చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో అఖిల్ హీట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం అఖిల్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న సినిమా చేస్తున్నాడిప్పుడు. 

 

అలాగే గౌర‌వం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ అంటూ తంటాలు ప‌డుతున్న హీరో అల్లు శిరీష్. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో ప‌ర్లేద‌నిపించిన ఈ హీరో బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం చూస్తూనే ఉన్నాడు. ఎంచుకునే క‌థ‌ల్లో వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఈ హీరో. కానీ అది తెర‌పైకి వ‌చ్చేస‌రికి మాత్రం మ‌రోలా ఉంటుంది. గౌర‌వం, ఒక్క క్ష‌ణం లాంటి డిఫెరెంట్ కాన్సెప్టుల మాదిరే.. ఇటీవ‌ల‌ ఏబిసిడి కూడా కొత్త‌గా ప్ర‌య‌త్నించాల‌ని చూసాడు అల్లు శిరీష్. కానీ అనుకున్న ఫ‌లితం అయితే రాబ‌ట్ట‌లేక‌పోయారు. 

 

మంచు మోహన్‌ బాబు నట వారసుడి ఇండస్ట్రీకి పరిచయం అయిన మనోజ్‌. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి సినిమాలతో ఆకట్టుకున్న తరువాత తన ఫాం కోల్పోయాడు. వరుస ఫ్లాప్‌లు పలకరించటంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం మ‌ళ్లీ అదే జోష్‌తో మంచు మ‌నోజ్‌ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: