మహానటి సినిమా తో ఎంతోమంది సినీ ప్రేక్షకులను తన నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ కొద్దికాలంలోనే ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. ఈరోజ ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డులలో కూడా కీర్తి సురేష్ కు 'మహానటి' సినిమాకు గాను ఉత్తమ కథానాయిక అవార్డు లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయానికి ఆమె అభిమానులు సంబరపడే లోపే తాజాగా రిలీజ్ అయిన ఒక అప్డేట్ వారందరినీ షాక్ కు గురి చేసింది.

 

తాజాగా రజిని నటించనున్న ఒక చిత్రంలో లో కీర్తి సురేష్ కూడా నటించినుందని అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా యువ కథానాయికలు తమ తో పోలిస్తే వయస్సు పరంగా ఎక్కువ అనంతరం ఉన్న సినిమా హీరోలతో జత కట్టేందుకు ఇష్టపడరు కానీ ఈ విషయంలో రజినీకాంత్ వేరే. అతనికి ఉన్న ఫాలోయింగ్ మరియు ఆయన సినిమాల రేంజ్ ను దృష్టిలో ఉంచుకొని మరో ఆలోచన లేకుండా రంగంలోకి దిగుతారు. గత ఏడాది వచ్చిన రోబో 2.0 లో నటించిన అమీ జాక్సన్ అందుకు ఉదాహరణ. తర్వాత రజనీ నటించిన పేట మరియు దర్బార్ సినిమాలలో కూడా సీనియర్ హీరోయిన్లతోనే జోడీ కట్టారు.

 

ఇక మొట్టమొదటిసారి తమ అభిమాన కథానాయకుడు రజనీ పక్కన జోడిగా కనిపించనుంది అన్న వార్త రాగానే అంతా ఎగిరి గంతేశారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం కీర్తి.. ర‌జ‌నీ ప‌క్క‌న క‌థానాయిక‌గా చేయ‌ట్లేద‌ట‌. ఇందులో ఆమె ఆయ‌న‌కు సోద‌రిగా క‌నిపించ‌నుంద‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్లు మీనా, ఖుష్బూలే ర‌జ‌నీకి జోడీగా క‌నిపిస్తార‌ట‌. ర‌జ‌నీ సినిమాలో కీర్తి హీరోయిన్ కాక‌పోవ‌డ‌మే ఆమె అభిమానుల‌కు నిరాశ క‌లిగించే విష‌య‌మంటే.. సోద‌రి అనేస‌రికి ఇంకా షాక‌వుతున్నారు.

 

ఈ చిత్రం కోసం కీర్తి మ‌ణిర‌త్నం సినిమాను సైతం వ‌దులుకోవ‌డాన్ని వాళ్లు త‌ప్పుబ‌డుతున్నారు. అజిత్‌తో వీరం, వేదాలం, విశ్వాసం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: