సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'దర్బార్' లో నటిస్తున్నారు. ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజని సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. చాలా ఏళ్ళ తర్వాత రజనీ మళ్ళీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తిండటం తో ఈ సినిమాపై అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుఠపురములో కూడా 2020 సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రజనీ నటించబోయే సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రజనీ స్పీడ్ కి కోలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ఇక అజిత్ తో వరసగా నాలుగు సినిమాలు తెరకెక్కించిన దర్శకుడే ఈ శివ. అన్నీ బ్లాక్ బస్టర్ సక్సస్ ని అందుకున్నాయి. ఇక రీసెంట్ గానే రజనీ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని కోలీవుడ్ మీడియా తాజా సమాచారం.

 

ఈ సినిమాలో కీర్తి సురేష్ రజనీకి చెల్లి పాత్రలో నటిస్తుందని సమాచారం. సహజంగా స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చెల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కానీ ఇది సూపర్ స్టార్ రజనీ సినిమా కావడంతోనే కీర్తి సురేష్ ఏమాత్రం ఆలోచించకుండా 'ఒకే' చెప్పేసిందట. ఎలాంటి నటీనటులకైనా రజనీకాంత్ సినిమాలో ఒక్కసారైనా నటించాలని ఉంటుంది. కీర్తి సురేష్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ సినిమా కోసమే మణిరత్నం సినిమా 'పోన్నియన్ సెల్వన్' నుంచి కీర్తి తప్పుకుందని కూడా కొలీవుడ్ టాక్. 

 

ఇక ఈ సినిమాలో రజనీకి జోడీగా మీనా.. ఖుష్బూ నటిస్తున్నారట. రజని168 గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని.. ఆగష్టులో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇలా కీర్తి రజనీకి చెల్లి గా నటిస్తుండటం కోలీవుడ్ లో కొందరికి మింగుడు పడటం లేదు. రజనీ సినిమాలో కీర్తి నటిస్తుఇందనగానే అంద్రు ఆయన సరసన హీరోయిన్ అనుకున్నారు. కాని హీరోయిన్ కాదు చెల్లి అనగానే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారట. ఇక కీర్తి చెల్లి పాత్రలో నటించడానికి అసలు కారణం సౌత్ లోనే సూపర్ స్టార్ కాబట్టి. అందులోను ఆయనతో మళ్ళీ మళ్ళీ నటించే అవకాశం రాదేమోన్నన్న ఆలోచనతో వెంటనే ఒప్పేసుకుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: