మహేష్ బాబు  హీరోగా నటించడ‌మే కాకుండా  పలు వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఏబీఎన్ మాల్స్ పేరుతో మల్టీప్లెక్స్‌లు  కూడా అడుగుతున్నాడు. ఇవి కాక రియల్ ఎస్టేట్ సంస్థల‌కు కూడా పెట్టు బడులు పెడుతున్నట్టు స‌మాచారం.  ఈ క్రమంలోనే ఇప్పుడు తన బ్యానర్లో తాను నిర్మాతగా మారి కొంతమంది హీరోలతో సినిమాలు కూడా నిర్మించాలని చూస్తున్నాడట. ఉత్సాహ దర్శకులను ప్రోత్సహిస్తూ సినిమా హీరోలను హీరోగా పెట్టి కొన్ని సినిమాలు తీయడంతో పాటు మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కూడా ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లోని అత్యంత కీలక వ్యక్తుల ద్వారా సమాచారం బయటకు పొక్కింది.  మహేష్ ను డీల్ చేసే ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సైతం ఇందుకు ఓకే చెప్పినట్టు టాక్.

 

అంతేకాక మ‌హేష్‌బాబు ఒక క్లాత్ మ‌ర్చంట్ కూడా ఉంది. అది కాక క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త యాడ్స్‌తో  ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తూ ఉంటాడు. ఇక ఈ మ‌ధ్య అయితే ఏకంగా త‌న సినిమాల‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా లాభాల్లో వాటాను అడ‌గ‌డం మొద‌లుపెట్టాడు. ఇలా ర‌క ర‌కాల రంగాల నుంచి మ‌హేష్ ఫుల్ బీజీగా సంపాదిస్తున్నాడు. 

 

మహర్షి మూవీ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..సరిలేరు నీకెవ్వరు. F 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అనిల్ సుంకర, దిల్‌రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఓ పవర్‌ఫుల్ రోల్‌‌తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కోసం అన్నపూర్ణ స్డూడియోలో రెండున్నర కోట్లతో 7 ఎకరాల్లో నిర్మించిన భారీ సెట్‌ నిర్మించారు. ఈ చిత్రంలో  కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్‌రాజ్‌ ఇంటి కోసం ఈ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లో ఫైట్ సీన్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: