టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటికే 95 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటితున్న ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర, మహేష్, దిల్ రాజు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్ కు ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభించడంతో పాటు, 

 

సినిమాపై భారీగా అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో వైభవంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నట్లు సరిలేరు యూనిట్, మొన్న ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. ఇక ఈ వేడుక కోసం మెగాస్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక నేడు మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్, తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఆసక్తికర ఫోటోని పోస్ట్ చేసారు. ఆ ఫొటోలో ఇద్దరు నటులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్లు గమనించవచ్చు. అయితే ఆమె పెట్టిన ఫొటోలో ఆ ఇద్దరు నటుల పేస్ లు కనపడకపోయినప్పటికీ వారిద్దరూ మరెవరో కాదు ఒకరు మెగాస్టార్ చిరంజీవి

 

మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు అని మనలో చాలా మందికి అర్ధం అవుతుంది. మరి ఆ విదముగా రహస్యంగా మహేష్, చిరు రహస్యంగా కలిసి దేనికోసం మంతనాలు చేస్తున్నారు అనే డౌట్ మనలో చాలా మందికి రావచ్చు. అయితే ఆ ఫొటోతో పాటు నమ్రత ఒక వాక్యాన్ని కూడా పోస్ట్ చేసారు. 'ఒకే  విధమైన ఆలోచనలు కలిగిన ఇద్దరు వ్యాక్తుల కలయిక ఒక హిస్టరీ కి దారి తీస్తుంది', మీ అందరు జనవరి 5న ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంటూ ఆమె పోస్ట్ చేసారు. కాగా నమ్రత చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: