నేటి యంగ్ హీరోయిన్లు సాధారణంగా వయస్సు పరంగా చాలా వ్యత్యాసమున్న సీనియర్ హీరోలతో జోడీ కట్టడానికి ఇష్టపడరు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో మాత్రం కథానాయికలు ఇలా ఆలోచించరు. ఎందుకంటే ఆయనకున్న చరిష్మా, ఫాలోయింగ్, ఆయన సినిమాల రేంజ్ను దృష్టిలో ఉంచుకుని కథానాయికగా నటించడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు.
గత ఏడాది రజనీ నుంచి వచ్చిన 2.0లో అమీ జాక్సన్ లాంటి యంగ్ హీరోయిన్ రజనీకి జోడీగా నటించడం ఇప్పుడు చెప్పవచ్చూ. ఇకపోతే కీర్తి సురేష్ మహానటి సినిమా వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ‘మహానటి’ సినిమాతో కీర్తి పతాకం అమాంతం పెరిగిపోయింది. అంతే కాకుండా ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా కైవసం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 168వ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందట. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్.. రజినీకాంత్ సరసన హీరోయిన్గా నటించడం లేదని వినికిడి.
ఇకపోతే రజినీకాంత్ సరసన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా నటిస్తుండగా, కీర్తి సురేష్ మాత్రం ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లెలు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఒక రకంగా కీర్తి సురేష్ అభిమానులకు ఇది మింగుడు పడని విషయం. ఇక ఇప్పుడు ప్రతివారిలో రజినీకాంత్ సరసన హీరోయిన్గా నటించకుండా ఈ పాత్ర ఎందుకు చేస్తుందనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మెదులుతుంది.
అంతేకాదు రజనీ కాంట్ చెల్లెలుకు జోడిగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ సరసన ఎవరైనా హీరోగా నటించే అవకాశం ఉందా అనే నుమానం కలుగుతుంది.. ఇక శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర పాత్రలో ప్రకాష్ రాజ్, సూరి, శ్రీమాన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 లో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నట్లు సమాచారం.