కెరియర్ మొదట్లో ఈరోజుల్లో, బస్టాప్ లాంటి సినిమాలు చేసిన డైరక్టర్ మారుతి తన పంథా మార్చుకుని ప్రతిరోజు పండగే లాంటి సినిమా చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. ఈ సినిమా చూసిన ప్రతిఒక్క ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. సినిమా కథ ఎమోషనల్ గా సాగినా దాన్ని ఎంటర్టైనింగ్ వేలో చూపించిన తీరు అందరిని మెప్పిస్తుంది.

 

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ థ్యాంక్స్ మీట్ లో నిర్మాత బన్ని వాసు మారుతి తనకు మంచి స్నేహితుడని.. ఇండస్ట్రీలో నలుగురు దర్శకులు తనకు క్లోజ్ అని. అందులో సుకుమార్, పరశురాం, మారుతి శ్రీకాంత్ అడ్డాల అని అన్నారు. మారుతితో తన రిలేషన్ గురించి చెబుతూ వచ్చిన బన్ని వాసు తను మారుతి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న టైంలో అతను ఒక సినిమా చేస్తున్నాడని తెలిసింది.

 

రెండు పైపులు, ఒక 5డి కెమెరాతో సినిమా మొదలు పెట్టాడు. అయితే అప్పుడు మారుతి మీద అంత నమ్మకం ఉండేది కాదని.. ఇంట్లో ఉన్న తులసి చెట్టుని మనం పట్టించుకోమని అలానే మారుతి టాలెంట్ ఏంటో నాకర్ధం కాలేదని అన్నారు బన్ని వాసు. మారుతి తీసిన ఆ సినిమా ఈరోజుల్లో పెద్ద సక్సెస్ అయ్యిందని. 50 లక్షలతో తీసిన ఆ సినిమా 8 కోట్లు వసూళు చేసిందని అన్నారు. 

 

మారుతి ఇలాంటి పెద్ద కాస్ట్ అండ్ క్రూతో సినిమా చేయడం తన ఫ్రెండ్ గా సంతృప్తిని ఇచ్చిందని అన్నారు బన్ని వాసు. ఇలాంటి ఎన్నో సినిమాలు మా కాంబినేషన్ లో రావాలని ఆయన అన్నారు. తనకు సపోర్ట్ గా నిలిచిన అల్లు అరవింద్, దిల్ రాజులను గుర్తుచేసుకున్నాడు బన్ని వాసు. సినిమాలో నటించిన నటీనటులకు తన కృతజ్ఞతలు తెలిపాడు బన్ని వాసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: