సుప్రీం హీరో  సాయి తేజ్ మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం  ప్రతిరోజూ పండగే. గత శుక్రవారం  విడుదలైన  ఈ చిత్రం యావరేజ్  రేటింగ్స్ ను రాబట్టుకుంది.  అయితే టాక్ బాగుండడం తో  తెలుగు రాష్ట్రాల్లో  మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం 9కోట్ల షేర్ ను రాబట్టి  ప్రీ రిలీజ్  బిజినెస్ లో సగానికి  పైగా వెనక్కుతెచ్చింది. ముఖ్యంగా  నిన్న    ఈ చిత్రం  బాక్సాఫీస్  వద్ద ఎక్స్ట్రాడినరీ  వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు 3కోట్ల షేర్ ను రాబట్టగా  మూడో రోజు 3.25 కోట్ల షేర్ ను  కలెక్ట్ చేసింది. అయితే ఈ రోజు నుండి  ఈచిత్రానికి అసలైన పరీక్ష  ఎదురుకానుంది. 
 
కాగా  ఈసినిమాతో విడుదలైన మిగితా సినిమా లు  చేతులెత్తేయడం అలాగే  సంక్రాంతి వరకు  పోటీ  లేకపోవడం  ప్రతి రోజూ పండగేకు  అడ్వాంటేజ్  కానుంది. మరి ఈ చిత్రం తో  సాయి తేజ్  వరసగా రెండో విజయాన్ని  సాదిస్తాడో లేదో చూడాలి.  పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.  యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2  సంస్థలు  నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.  ఇక  సాయి తేజ్  ప్రస్తుతం  నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో  సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  నాభ నటేష్  హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న  ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఈ చిత్రం తరువాత  తేజు , ప్రస్థానం ఫేమ్ దేవకట్టా తో సినిమా చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: