సుప్రీం హీరో సాయి తేజ్ మినిమం గ్యారెంటీ
డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ప్రతిరోజూ పండగే. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం యావరేజ్ రేటింగ్స్ ను రాబట్టుకుంది. అయితే టాక్ బాగుండడం తో తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం 9కోట్ల షేర్ ను రాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా వెనక్కుతెచ్చింది. ముఖ్యంగా నిన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్స్ట్రాడినరీ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు 3కోట్ల షేర్ ను రాబట్టగా మూడో రోజు 3.25 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అయితే ఈ రోజు నుండి ఈచిత్రానికి అసలైన పరీక్ష ఎదురుకానుంది.
కాగా ఈసినిమాతో విడుదలైన మిగితా
సినిమా లు చేతులెత్తేయడం అలాగే
సంక్రాంతి వరకు పోటీ లేకపోవడం ప్రతి రోజూ పండగేకు అడ్వాంటేజ్ కానుంది. మరి ఈ చిత్రం తో సాయి తేజ్ వరసగా రెండో విజయాన్ని సాదిస్తాడో లేదో చూడాలి.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇక సాయి తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభ నటేష్
హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్ఎన్
ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఈ చిత్రం తరువాత తేజు , ప్రస్థానం ఫేమ్ దేవకట్టా తో
సినిమా చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.