డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటించిన షాలిని పాండే ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే హిట్ అందుకుంది. సినిమా విజయం తర్వాత సౌత్ ఇండస్ట్రీలో చాలా భాషల నుండి ఆమెకు అనేక అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అదేవిధంగా తెలుగు తమిళం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమా ఛాన్సులు అందుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది షాలిని పాండే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈమె పై క్రిమినల్ కేసు నమోదైనట్లు కేసు తీవ్రతను చూస్తే పోలీసులు అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తాజాగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

 

అసలు మేటర్ ఏమిటి విజయ్ ఆంటోని కి జంట షాలిని పాండే 'అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేయడం జరిగింది. మూడర్ కూడం నవీన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ లో కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే పాల్గొన్న షాలిని ఆ తరువాత సెట్స్ కి రావడం మానేసిందట. మిగిలిన సన్నివేశాల్లో నటించనని తేల్చి చెప్పిందట. అయితే సినిమాకి సంబంధించిన నిర్మాత శివ హీరోయిన్ షాలిని పాండేని ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేయగా ఆమె చేయనంటే చేయను అని తేల్చి చెప్పేసిందట.

 

దీంతో నిర్మాత చేసేదేం లేక రెమ్యునరేషన్ తీసుకుని సినిమాకి సంబంధించి ప్రాజెక్టు పై సంతకాలు పెట్టి సినిమా షూటింగ్ చెయ్యనంటుంది అని తెలుగు, తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో షాలినిపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్ లో ఆమెపై క్రిమినల్ కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా  షాలిని పాండే ఇటీవల సౌత్ ఇండస్ట్రీ కి చెందిన సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదంట. మేటర్ లోకి వెళ్తే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనేక సినిమా అవకాశాలు వస్తున్నట్లు తాజాగా రణవీర్ సింగ్ పక్కన నటించే ఛాన్స్ కూడా దక్కించుకున్నట్లు సౌత్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో షాలిని పాండే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: