అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండే అందం అభినయంతో మెప్పిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ సినిమాలు పడలేదు కాని అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగుతో పాటుగా తమిళ సినిమాలు చేస్తున్న షాలిని పాండే తమిళ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. తమిళంలో 100% కాదల్ సినిమా చేసిన షాలిని విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ సినిమాలకు సైన్ చేసింది. 

 

అగ్ని సిరాగుగుల్ సినిమాలో నటిస్తున్న షాలిని ముడార్ కుడం నవీన్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తుంది. ఈ సినిమాకు 27 రోజులు షూటింగ్ చేశాక షాలిని పాండే మిగతా షూటింగ్ కు రావడంలేదట. డైరక్టర్ నిర్మాతకు ఫిర్యాదు చేయడంతో ఆ సినిమా నిర్మాతలు షాలిని పాండే మీద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. 

 

షాలినికి బాలీవుడ్ ఆఫర్ రావడం వల్లే ఆ సినిమా షూటింగ్ కు రావట్లేదని తెలుస్తుంది. ఈ విషయంపై తమిళ నిర్మాతలు షాలిని పై సీరియస్ గా ఉన్నారట. తెలుగులో కూడా షాలినికి అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ మీద అమ్మడి దృష్టి ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో షాలిని పాండే రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే సినిమా చేసింది. 

 

ఈ సినిమాతో పాటుగా అనుష్క నిశ్శబ్దం సినిమాలో కూడా షాలిని నటిస్తుంది. మరి షాలిని తమిళ నిర్మాతల గొడవ ఎలా సెట్ రైట్ అవుతుందో చూడాలి. షాలిని పాండే బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్ తో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా హిట్ అయితే మాత్రం షాలిని ఫేట్ మారిపోయినట్టే. అక్కడ అవకాశం వస్తే ఇక్కడ వారికి హ్యాండ్ ఇచ్చి హిందీలో చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చేస్తూనే అక్కడ సినిమాలు చేయొచ్చు కదా అంటున్నారు ప్రేక్షకులు. మరి అమ్మడు తన ఆలోచన మార్చుకుంటే బెటర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: