అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి లో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన ముఖం లోని అన్ని హావభావాలను పండించి తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది ఈ అమ్మడు. ఇక హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుని దూకుడు చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడి మాత్రం అంతగా అవకాశాలు అందిపుచ్చుకునే లేకపోయింది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన 118 సినిమా  లో నటించింది ఈ అమ్మడు... మహానటి లో కూడా ఓ పాత్రలో నటించింది. అంతకుమించి అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి దక్కలేదు. అటు ఈ అమ్మడికి జోడిగా నటించిన విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ హీరోగా మారిపోయాడు. 

 

 

 ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు ఓ సినిమాను సంతకం చేసింది షాలిని పాండే . కొన్ని వారాల పాటు సజావుగా సెట్స్ కు వెళ్ళి  షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు...aa తర్వాత  షూటింగ్ ఎగవేతకు పాల్పడుతుందంటూ  శాలిని పాండే పై  చిత్ర బృందం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిత్ర నిర్మాత శివ శాలిని పాండే పై పోలీసులకు ఫిర్యాదు చేశారట... దీంతో షాలిని పాండే పై  క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. అయితే షాలిని పాండే పై అంతకుముందే తెలుగు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ అమ్మడు వచ్చిన సినిమా అవకాశాల విషయంలో కూడా ఇలా ఎందుకు చేసింది  అనుకుంటున్న తరుణంలో ఓ కారణం తెరమీదికి వచ్చింది. 

 

 

 శాలిని పాండే ఇటీవలే బాలీవుడ్లో ఒక అదిరిపోయే ఆఫర్  దక్కించుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ నేటితరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన జయేష్ భాయ్ జోర్దార్ అనే  చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు చిత్రబంధం శాలిని పాండే ను ఎంపిక  చేసిందట. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కోసమే దక్షిణాది సినిమాలను శాలిని పాండే పక్కన పెడుతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజా ఘటనతో శాలిని పాండే నిజంగానే దక్షిణాది సినిమాలను పక్కన పెడుతుందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: