అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "అల.. వైకుంఠపురం లో 
ఈసినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే అల వైకుంఠపురం సినిమా మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు..

 

ఎందుకంటే ఈ సినిమా పాటలు, టీజర్, లూక్స్ ఒకరేంజ్ లో ఉన్నాయి.. అలాగే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది.. ఈ సినిమాకి పోటీగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా రానుంది.. ఎవరి పబ్లిసిటీ లో వాళ్ళు కొత్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.. ఇపుడు అలా వైకుంఠపురం సినిమా విషయంలో అల్లు అర్జున్ సంతృప్తిగా లేడని టాక్ వచ్చింది.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ ప్రతి సినిమా అక్కడ కూడా విడుదలవుతుంటుంది. వాళ్ళు కూడా అల్లు అర్జున్ ని అభిమానిస్తారు.. దీంతో కలెక్షన్లు కూడా మంచిగానే వస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీని కూడా ‘అంగు.. వైకుంఠపురత్తు' అనే టైటిల్‌తో మలయాళం భాషలో కూడా తెరకెక్కించి విడుదల చేస్తున్నారు. 

 


అలానే త్రివిక్రమ్ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రతి సినిమాలో.. అలాగే ఈ సినిమాలో కూడా కుటుంబ సన్నివేశాలు, డైలాగ్స్, కధ కూడా ఆకట్టుకునే విధంగా తీసాడంట సినిమా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసిందట. ఈ నేపథ్యంలో సినిమా రన్‌టైమ్ చూసుకుంటే 185 నిమిషాలు ఉందని అంటున్నారు.

 

అంటే మూడు గంటలు కంటే ఐదు నిమిషాలు ఎక్కువన్న మాట. ఈ విషయంపై అల్లు అర్జున్ అసంతృప్తితో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.ఎందుకంటే సినిమా హల్లో ప్రేక్షకులను మూడు గంటల పాటు అలా కుర్చోపెట్టాలంటే చాలా కష్టం..

 

ప్రేక్షకులు అసహనానికి గురవతారన్న అభిప్రాయం లో ఉన్నాడు అల్లు అర్జున్. అయితే, 3 గంటలు ఉన్న ‘బాహుబలి', ‘అర్జున్ రెడ్డి' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.కాని బన్నీ మాత్రం సినిమా రన్ టైం తగ్గించాలని సూచించారట.. ఆ మేరకు త్రివిక్రమ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలని కత్తిరిస్తున్నట్లు సమాచారం.. రన్ టైమ్ కూడా రెండున్నర గంటలకి కుదించబోతున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: