దిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ కి వచ్చి ఇక్కడ సత్తా చాటుతోంది రాశీ ఖన్నా. టాలీవుడ్ లో ఐదారేళ్లు గా తన కెరీర్ ని షేపప్ చేసుకున్న తీరు ఇంప్రెస్సివ్ అనే చెప్పాలి. వరుసగా యంగ్ హీరోల సరసన నటించిన రాశీ తన కెరీర్ ని సాఫీ గా సాగిస్తోంది. హిట్టు ఫ్లాపు తో సంబంధం లేకుండా రాశీకి ఫాలోయింగ్ పెరిగింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించిన ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ. ఆ తర్వాత జోరు, బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవ కుశ..ఇలా వరుసగా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తను నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ లేనని చెప్పాలి. 

 

ముఖ్యంగా 2018-19 సీజన్ తనకు బాగా కలిసొచ్చింది. గత ఏడాది తొలి ప్రేమ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత ఫ్లాపుల వల్ల వచ్చిన నష్ఠమేమీ లేదు. ఈ ఏడాది ఏకంగా నాలుగైదు సినిమాల్లో నటించి హిట్స్ అందుకుంది. తాజాగా రిలీజైన వెంకీమామ- ప్రతి రోజూ పండగే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం తన కు పెద్ద ప్లస్ అవుతోంది. ఇప్పుడు విజయ్ దేవర కొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా తనకు వచ్చిన డోఖా ఏమీ లేదు. తదుపరి బిగ్ లైనప్ కి ప్లాన్ చేసుకోవడంలో రాశీ బిజీ బిజీగా ఉంది.

 

ఇక రాశీకి సక్సెస్ తో పనే లేకుండా యూత్ లో అద్భుత మైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో 40లక్షలు పైగా అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తన ఫోటో షూట్ల కు అంతే గిరాకీ ఉంటుంది. ఇక రాశీని లైమ్ లైట్ లో ఉంచేందుకు సోషల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒక హాట్ డిబేట్ ని తెర పైకి తెస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి అదిరి పోయే కౌంటర్ ఇచ్చి మరో సారి ట్రెండింగ్ అవుతోది. నేను ఎవరినీ పట్టించు కోను!.. పట్టించుకోవాల్సిన పనే లేదు..  అంటూ సోషల్ ట్రోలర్స్ కి ఒకే ఒక్క పోస్టింగు తో చెక్ పెట్టేసింది బొద్దుగుమ్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: