టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా అడుగుపెట్టిన మెగాస్టార్ సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తొలి సినిమాతో మంచి పేరు దక్కించుకుని అక్కడి నుండి వరుసగా మంచి విజయాలతో పాటు విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక గత ఏడాది అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్, అతి త్వరలో బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ ద్వారా టాలీవుడ్ కి మళ్ళి రీఎంట్రీ ఇవ్వనున్నారు. 

 

అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్, అలానే ఇతర నటీనటుల ఎంపిక స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం పవన్ కు ఏకంగా రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట నిర్మాతలు. అయితే ఇది టాలీవుడ్ సినిమా హీరోల్లో అత్యధిక మొత్తం అని అంటున్నారు. అయితే రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకోవడంతో పాటు, 

 

అక్కడి నుండి మెల్లగా మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుని, విపరీతమైన క్రేజ్ ని, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన కూడా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం మహెష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ అందినట్లు టాక్. దీని ప్రకారం, ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ పరంగానే కాక రెమ్యునరేషన్ పరంగా కూడా అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న కింగులుగా వీరిద్దరూ నిలుస్తారని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: