ముకుంద సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, తొలిసినిమాతో పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ, తన నటనతో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కంచె, ఘాజి, తొలిప్రేమ, ఫిదా వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న వరుణ్ తేజ్, ఇటీవల మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ అనే సినిమాలో హీరోగా నటించాడు. తన ఎంటైర్ కెరీర్లో తొలిసారిగా ఫుల్ మాస్ పాత్రలో నటించిన వరుణ్, గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టాడు. 

 

ఇక ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో, ఇకపై కెరీర్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు వరుణ్. ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు బన్నీ సోదరుడు అల్లు వెంకటేష్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

 

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఇటీవల దబాంగ్ 3 ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన సాయి మంజ్రేకర్ ని తీసుకోవాలని ఆ సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, కావున అందరంతో పాటు అభినయానికి స్కోప్ ఉన్న ఆ రోల్ కు సాయి మంజ్రేకర్ అయితే బావుంటుందని ఫిక్స్ అయ్యారట. నిర్మాత అల్లు అరవింద్ ఆమెను వరుణ్ సినిమాలో తీసుకునే విషయమై హెల్ప్ చేసినట్లు టాక్. కాగా ఈ వార్త నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: