రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్ రూపంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరకు వచ్చేసింది. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన పాటలు మరియు టీజర్ సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేసింది. అయితే సినిమాలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాజకీయాల నుండి మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇవ్వటంతో సినిమాకి మంచి హైప్ ఉంది. టీజర్ మరియు రిలీజ్ అయినా పాటలకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుందని నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైలాగ్ వింటే థియేటర్లో మహేష్ అభిమానులకు వెంట్రుకలు నిక్కబొడుచు కోవటం గ్యారెంటీ అని టాక్ వినపడుతుంది.

 

ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఆర్మీను ఉద్దేశించి చెప్పే డైలాగ్ ఏమిటంటే “ఇరవై(20)లో చదువు పాతికలో(25) ఉద్యోగం ముప్పైకి(30)కి పెళ్లి నలభై(40)కి షుగర్ యాభైలో(50) లో ఒళ్ళు నొప్పులతో చచ్చిపోడం. ఇలా చచ్చే కన్నా అక్కడ బార్డర్ కెళ్ళి సచ్చిపోడం బెటర్” అంటూ మహేష్ ఓ డైలాగ్ సినిమాలో చెప్పబోతున్నట్లు ఖచ్చితంగా ఈ డైలాగ్ కి మహేష్ అభిమానులు థియేటర్లో గోల గోల చేయడం గ్యారెంటీ అన్నట్లు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో చాలామంది డైలాగ్ విని కామెంట్లు చేస్తున్నారు.

 

మరొక పక్క దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఇచ్చిన బాణీలు కూడా హైలెట్ గా ఉండటంతో జనవరి 11 వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటూ అభిమానులు డిసైడ్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: