తాజాగా  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రాన్ని నటిస్తున్నారు.సోమవారం సాయంత్రం ఈ చిత్రంలో  టైటిల్‌ సాంగ్‌ను  విడుదల చేసింది చిత్రబృందం. ఈ  చిత్రంలో మొత్తం 5 పాటలను రాసారు .  వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు ఈ సినిమాలోని 5 పాటలను  రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్‌.. చెప్పిన విధంగానే  గత మూడు సోమవారాలు మూడు పాటలను ఈ చిత్ర యూనిట్  విడుదల చేసింది. ఇంతకముందులాగే ఇప్పుడు కూడా అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 23) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు.  

 


తాజాగా విడుదలైన ఈ పాట సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌గా విడుదలైనది  నిజానికి ఈ పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. ఈ పాటలో సైనికుల విలువలను గుర్తు చేస్తూ రూపొందించిన విధంగా వుంది . ఈ పాట వింటే ప్రతి ఒక్కరి మనసును కదిలించేదిగా ఉంది.

 

‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, ఈ చిత్రంలోని పాటను  ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌  ఈ పాట కోసం యూరప్‌ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్‌ చేశాడు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.

 

ఈ చిత్రంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు .  చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.  దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: