రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. అయితే దేవి మంచి సంగీత దర్శకుడే కాదు మంచి రచయిత అని కూడా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా ఒకటి. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మూడు పాటల్లో ఏ ఒక్కటి కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో దేవి పై విమర్శలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ చిత్రం నుండి సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ విడుదలైయింది. ఈ సాంగ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
శంకర్ మహదేవన్ పాడిన ఈసాంగ్ కు దేవి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అంతేకాదు ఈ పాట రాసింది కూడా దేవినే కావడం విశేషం. దేశ భక్తి ని చాటి చెప్పే అర్ధవంతమైన లిరిక్స్ తో ఈసాంగ్ ను రాసినందుకు దేవి శ్రీ ప్రసాద్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంగ్స్ రాయడం దేవికి ఇది మొదటి సారి కాదు ఇంతకుముందు 'ఓమధు ,ఓమధు' అలాగే నిన్ను చూడగానే నా చిట్టిగుండె వంటి కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ కూడా దేవి రచనలో నుండి వచ్చినవే. ఇక ఇదిలావుంటే
సక్సెస్ ఫుల్
డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుండగా
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా జనవరి11 న విడుదలకానుంది.