ఈ రోజు ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన రాబోయే చిత్రం టైటిల్‌ను వెల్లడించారు నిర్మాతలు దీనితో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆది సాయి కుమార్ రాబోయే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం పేరు 'శశి'. శశి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో మైక్ పట్టుకున్నట్లు కనిపించడంతో ఆది గాయకుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఆది సాయి కుమార్‌కు కోపం ఎక్కువని శశి యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి కొత్తగా వచ్చిన శ్రీనివాస నాయుడు నాడికట్ల దర్శకత్వం వహిస్తున్నారు, చిటలపుడి శ్రీనివాస్ మరియు చావళి రామంజనేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథగా చెప్తున్న ఈ సినిమా ఆది సాయి కుమార్‌ను మూడు వేర్వేరు షేడ్స్‌లో చూపిస్తుందని సమాచారం. ఈ శశి చిత్రంలో సురభి, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రావు రమేష్, రాధిక మరియు అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు.

 

ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, సురభిసినిమా గురించి మాట్లాడుతూ, “ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అంతే కాకుండా వినోదభరితంగానూ ఉంటుంది" అని చెప్పారు. సురభి చివరిసారిగా ఒక్క క్షణం సినిమాలో కనిపించింది. న్యూ ఢిల్లీలో జన్మించిన నటి సురభి తమిళ చిత్రం 'ఇవాన్ వెరా మాతిరి' తో సౌత్ లో ఆకట్టుకుంది. చివరి షెడ్యూల్ మినహా, శశి షూటింగ్ మొత్తం పూర్తయింది. 2020 వేసవిలో సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఆది సాయి కుమార్ 2011లో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 'ప్రేమ కావాలి' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో అతని నటనకు గానూ ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు ఆది. ఆది చివరిసారిగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' లో కనిపించాడు. ఇప్పుడు తన అభిమానులను అలరించడానికి శశితో వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: