అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది షాలినీ పాండే. ఆ తరువాత మహానటి, ఎన్టీయార్ కథానాయకుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. కళ్యాణ్ రామ్ కు జోడీగా 118 సినిమాలో నటించిన షాలినీ ఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రాజ్ తరుణ్ కు జోడీగా షాలినీ నటించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా రేపు విడుదల కాబోతుంది. 
 
ప్రస్తుతం షాలినీ పాండే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న షాలినీపై తమిళ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. షాలినీ పాండేపై ఒక క్రిమినల్ కేసు నమోదు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలలోకి వెళితే విజయ్ ఆంటోనీ లీడ్ రోల్ లో నటిస్తున్న అగ్ని సిరాగుగల్ సినిమాలో నటిస్తానని సంతకం చేసింది షాలినీ పాండే. 
 
ఈ సినిమాకు మూడార్ కూడమ్ నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో కొన్ని రోజులు పాల్గొన్న షాలినీ ఆ తరువాత షూటింగ్ కు రావడం మానేసింది. షూటింగ్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించిన టీం కు బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నందుకు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపడం లేదని తెలిసింది. సినిమాను నిర్మిస్తున్న అమ్మ క్రియేషన్స్ టీ శివ షాలినీకి నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేశాడు. 
 
కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అగ్ని సిరాగుగల్ చిత్ర యూనిట్ తమిళ, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయటంతో పాటు షాలినీ పాండేపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. షాలినీకు రణవీర్ సింగ్ పక్కన జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. సూపర్ స్టార్ పక్కన నటించే అవకాశం రావడంతో అగ్ని సిరాగుగల్ షూటింగ్ కు హాజరు కావడం లేదని తెలుస్తోంది. అగ్ని సిరాగుగల్ సినిమాలో షాలినీ నటించాల్సిన పాత్రలో అక్షర హాసన్ నటిస్తోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: