టాలీవుడ్‌కానీ, బాలీవుడ్ కానీ ఎక్క‌డైనా ఒక్క హిట్ కొడితే చాలు ఇంక ఆ ద‌ర్శకుడి వెంట ప‌డుతుంటారు మ‌న హీరోలు. బెల్లం చుట్టూ ఈగ‌ల్లా అస‌లు వ‌దిలిపెట్ట‌రు. ఈ మ‌ధ్య కాలంలో క‌థ బావుంటేనే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్న నేప‌థ్యంలో... ద‌ర్శ‌కులు కూడా అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుని ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

 


ఇక ఇటీవ‌లె హిట్ అయిన చిత్రం ఖైదీ. కార్తి న‌టించిన ఈ చిత్రం అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దీంతో ఆ ద‌ర్శ‌కుడికి డిమాండ్ పెరిగింది. ఓ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌తో ఇండస్ట్రీని చేసిన తమిళ దర్శకుడి కోసం తెలుగు స్టార్‌ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు.

 


ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించ‌డ‌మే కాకుండా.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్స్ పై ఎక్కువ ఆశ‌క్తిక‌రంగా ఉంటున్నాడు. అందుద‌కు కార‌ణం లేక‌పోలేదు త‌న గ‌త చిత్రం`విన‌య విధేయ రామ‌` ఘోర ప‌రాజ‌యం అవ్వ‌డంతో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాల పై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. క‌థ ద‌గ్గ‌ర నుంచి ద‌ర్శ‌కుల వ‌ర‌కు అన్నీ ఎంతో కేర్‌గా చూసుకుంటున్నాడు ఈ హీరో. 

 

  భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్న‌ చరణ్ ఇటీవల బ్లాక్‌ బస్టర్‌ హిట్ ఇచ్చిన ఓ తమిళ దర్శకుడితో చరణ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఖైదీ చిత్రం కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సౌత్ స్టార్‌ హీరోలు ఈ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ వెంటపడుతున్నార‌ని స‌మాచారం. 

 


ఖైదీ తరువాత లోకేష్‌.. కోలీవుడ్‌ టాప్ హీరో విజయ్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌తోనూ లోకేష్‌ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాల తరువాత లోకేష్‌తో సినిమా చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇక మ‌రి వీరిద్ద‌రి ప్రాజెక్ట్ మొద‌ల‌వ్వాలంటే ఎంత స‌మ‌యం ప‌డుతుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: