తెలుగులో ఉన్న సూపర్ డైరక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య నుండి రంగస్థలం వరకు సుకుమార్ తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని నటుడుని బయటకు తీశాడు. ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. లేటెస్ట్ గా 66వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా రంగస్థలం సత్తా చాటింది. ఈ సినిమాకు 4, 5 విభాగాల్లో అవార్డులు అందుకుంది. 

 

రామ్ చరణ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం విశేషం. రంగస్థలం సినిమాకు అవార్డులు రావడం సుకుమార్ కు ఇంకాస్త జోష్ వచ్చింది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఆ సినిమా కూడా రంగస్థలం లానే చాలా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట.

 

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ లానే ఈ సినిమాలో కూడా బన్ని కూడా సర్ ప్రైస్ చేస్తాడని అంటున్నారు. రంగస్థలం హిట్ అవడమే కాదు  అవార్డులు తీసుకురావడంతో సుకుమార్ విజన్ కు ఇక ఎదురులేదు అన్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సుకుమార్ సినిమా సెట్స్  మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అల వైకుంఠపురములో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ సినిమాతో కూడా బన్ని భారీ స్కెచ్ వేశాడు. మరి బన్ని సుకుమార్ చేసే సినిమా మరో రంగస్థలం అవుతుందో లేదో చూడాలి. 

 

అల్లు అర్జున్ సినిమా విషయంలో కూడా సుకుమార్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో ఉంటుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: