ఆరు వరుస ఫ్లాపుల తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన "చిత్రలహరి" సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా విజయం అతనిలో ఉత్సాహాన్ని నింపింది. దాంతో మారుతి దర్శకత్వంలో "ప్రతి రోజూ పండగే" అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఈ నెల ౨౦ వ తేదిన మనముందుకి వచ్చాడు. ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ వారం విడుదల అయిన అన్ని చిత్రాలలో కెల్లా మంచి వసూళ్ళు సాధిస్తున్న చిత్రంగా నిలిచింది.

 

శతమానం భవతి లాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఆ సినిమా అంత కాకపోయినా ఫ్యామిలీలని బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఈ సినిమాకి అడ్డంకి లేదనే చెప్పాలి. మరి ఈ సినిమా వసూళ్ళ పరంగా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. అయితే ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మరో సినిమాని లైన్లో పెట్టాడు.

 

సోలో బతుకే సో బెటర్' అనే యూత్ ఫుల్ ఫిలిం ఒకటి లైన్లో పెట్టిన తేజు రిస్కు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు దేవ కట్టా కావడమే. దేవ కట్టా ప్రస్థానం సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు. అయితే ప్రస్థానం తర్వాత దేవ కట్టా కెరీర్లో సరైన హిట్ లేదు. నాగచైతన్యతో తీసిన "ఆటోనగర్ సూర్య" బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. అదీ గాక ప్రస్థానమ్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసినప్పటికీ సరైన ఫలితం అందలేదు.

 

అలాంటి దర్శకుడితో సినిమా అంటే నిజంగా రిస్క్ చేయడమే. కానీ దేవ కట్టా టేకింగ్ చాలా బాగుంటుంది. ఆయన కథలు కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంటాయి. కాబట్టి తేజ్ ఈ రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మరి తేజ్ రిస్క్ ఫలిస్తుందా లేదా చూడాలి. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో చిత్రీకరణకి వెళ్ళనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: