బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవి' పేరిట జయలలిత బయోపిక్‌ని విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మీద ఇప్పటికే మూడు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి వెబ్ సిరీస్ కాగా మరో రెండు సినిమాలుగా విడుదల అవుతున్నాయి. అయితే వీటన్నింటిలోకి ఎక్కువ ఆకర్షిస్తున్న బయోపిక్ కంగన నటిస్తున్నదే.

 

 

ఎందుకంటే బాలీవుడ్ క్వీన్ నటిస్తుండడంతో ఇంతటి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా లావుగా కనబడాల్సిన అవసరం ఉంది.  అయితే కంగనా లావుగా అవడానికి ఇష్టపడక ప్రోస్థటిక్స్ వాడింది. తలైవి పస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత ఆ ప్రోస్థటిక్ లో ఆమెను చూసిన వాళ్ళందరూ విమర్శించారు. ప్రోస్థటిక్ సరిగా లేదని, దానివల్ల సినిమాకి నష్టం జరుగుతుందని అంటున్నారు.

 

 

అయితే ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న కంగనా తాను లావుగా అవడానికే నిర్ణయించుకుందట. గత నెల రోజుల్లో ఆమే ఏడు కిలోలకి పైగా బరువు పెరిగిందట. మరో పదిహేను కేజీల బరువు పెరిగాక ఆ సీన్లు తీసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. హీరో హీరొయిన్లు సినిమా క్యారెక్టర్ల కోసం అధిక బరువు పెరగడం చాలా రిస్క్. ఎందుకంటే ఒకసారి బరువు పెరిగిన తర్వాత మళ్ళి తిరిగి యథాస్థానానికి చేరుకోవడం చాలా కష్టం.

 

అనుష్క సైజ్ జీరో సినిమా కోసం ఎంతో బరువు పెరిగింది. కానీ మళ్ళీ తిరిగి బరువు తగ్గించలేకపోయింది. ఇప్పటికీ తాను బరువు తగ్గించడానికి అవస్థలు పడుతూనే ఉంది. మరి కంగన ఈ రిస్క్ తీసుకుని విమర్శకుల నోళ్ళు మూయిస్తుందా లేదా చూడాలి.  అంతే గాక మళ్లీ తన యధా స్థానానికి చేరుకుని తనని తాను నిరూపించుకుంటుందా అనేది ఆసక్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: