చిత్రలహరి తరువాత
సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజు పండగే ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో సాయి తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అందులో భాగంగా ఇప్పటివరకు ఈ చిత్రం 288k డాలర్ల వసూళ్లను కలెక్ట్ చేసిందని సమాచారం. ఇక రేపు క్రిస్మస్ సందర్భంగా సెలువు దినం కావడం ఈ చిత్రానికి కలిసి రానుంది. దాంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. మొదటి మూడు రోజుల్లో 9కోట్ల షేర్ ను రాబట్టిన ఈచిత్రం నాలుగో రోజు కూడా 1.5కోట్ల షేర్ తో పర్వాలేదనిపించింది. మరో 5.5కోట్లు తెస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతం సంక్రాంతికి వరకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీలేకపోవడం, ఈ చిత్రానికి అడ్వాంటేజ్ కానుంది. మారుతి డైరెక్షన్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే సాయి తేజ్ ప్రస్తుతం కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.