అల్లు అర్జున్ సినిమా  'నా పేరు సూర్య' పెద్దగా హిట్ సొంతం చేసుకోక పోవడంతో అభిమానులు చాల నిరాశ చెందిన సంగతి అందరికి  తెలిసిందే కదా. ఆ తర్వాత అభిమానులు అందరిలో జోష్ పెంచేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా 'అల.. వైకుంఠపురములో' కన్ఫర్మ్ చేసి అప్‌డేట్స్ ఇవ్వడం జరిగింది బన్నీ. ఇక తీరా సినిమా విడుదల సమయం  దగ్గర పడుతుందన్న ఈ తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఇక పూర్తి వివరాలు ఇలా ..త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్‌లో 'అల.. వైకుంఠపురములో' సినిమా అభిమానుల ముందుకు రావడానికి  ఆసక్తి రేకెత్తించింది. కొన్ని నెలలుగా షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తాము అని ప్రకటించారు చిత్ర బృందం. ఇలా ప్రకటన చేయడంతో  ఆ తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు .

 

ఇది ఇలా ఉండగా  తాజాగా తెలిసిన సమాచారం మేరకు ఆ తేదీన విడుదల అవ్వడం చాల కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో వైవు  చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలియచేసినప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో ఈ వార్త బన్నీ అభిమానులకు ఏ మాత్రం తట్టుకోవడం  లేదు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాల్సి కారణంగా ఆలస్యమవుతోందని అని సమాచారం.

 

ఇక 'అల.. వైకుంఠపురములో'  సినిమాలోని సెకండాఫ్‌లో ఉండే  కొన్ని సన్నివేశాలు బాగా రాకపోవడంతో వాటిని మళ్ళీ  షూట్ చేస్తున్నారని అని సమాచారం. అలాగే ఇంకా ఓ సాంగ్ కోసం దుబాయ్ షెడ్యూల్‌లో ఉండడం, అది కూడా కాస్త ఆలస్యమవుతోందని విశ్వసనీయ వర్గాల తెలియచేస్తున్నారు. దీంతో  'అల.. వైకుంఠపురములో' టీమ్ బాగా టెన్షన్ పడుతోందని ఇండస్ట్రీలో టాక్.

 

ఈ తరుణంలో అనుకున్న తేదీకే ఎలాగైనా 'అల.. వైకుంఠపురములో' సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని త్రివిక్రమ్ ప్లాన్ ఉన్నప్పటికీ కూడా .. అది అవ్వకపోయావడంతో బాగా వైరల్ గా మారింది సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవ్వడానికి  జనవరి 5వ తేదీ రావచ్చని సమాచారం. ఒకవేళ అదే కన్ఫామ్ ఐతే మాత్రం  సినిమాను జనవరి 26కు వాయిదా వేసే అవకాశాలు చాల ఉన్నాయి అని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: