ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి మరో సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో చాల బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ''సరిలేరు నీకెవ్వరు ఆంథమ్'' విడుదల చేయడం జరిగింది.
ఇక ఇందులో దేశ సైనికుల గొప్పతనాన్ని, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ చేసిన ఈ పాట నిజంగా అందరి మనసును కదిలించే విధంగా మారింది. ''మారణాయుధాలు ఎన్ని ఎదురైనా.. ప్రాణాన్ని ఎదురు పంపేవాడు.. ఒకడే ఒకడు వాడే సైనికుడు..'' అంటూ రోమాలు నిక్కబొడిచేలా ఉన్న లిరిక్స్తో ఈ పాట అభిమానుల అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.
ఇక ఈ పాటకు శంకర్ మహదేవన్ ఆలపించిన దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించడం చాల విశేషం. ప్రత్యేకంగా ఈ పాట కోసం దేవిశ్రీ యూరప్ వెళ్లి కళాకారులతో కలిసి మ్యూజిక్ని కంపోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఈ సాంగ్ బాగా హైలైట్ అవుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన మరో పాటకు మహేష్ కూతురు సితార చేసిన డాన్స్ కూడా బాగా అక్కట్టుకుంది అభిమానులను.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు- అనిల్ రావిపూడి కంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్గా పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమాలో విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటించడం . విశేషం. ఈ సినిమాకి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.