టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, స్వతహాగా మంచి డ్యాన్సర్ కూడా. ఈటివి ఛానల్ లో కొన్నాళ్ల క్రితం ఢీ డ్యాన్సింగ్ షోలో అద్భుతమైన డ్యాన్స్ లతో మెరిసిన సాయి పల్లవి, ఆ తరువాత మెల్లగా తన యాక్టింగ్ టాలెంట్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో ఫిదా తరువాత అత్యద్భుతమైన పేరు సంపాదించిన ఆమెకు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కణం, ఎన్జీకే, మారి 2, పడి పడి లేచే మనసు సినిమాలు పెద్దగా సక్సెస్ ని అయితే అందించలేదు.

 

ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, 
రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి గురించిన ఒక వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితం ఆమెకు రెండు బడా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రావడం జరిగిందని, అయితే ఆ సినిమాల్లోని తన క్యారెక్టర్స్ కు గ్లామర్ ప్రదర్శనకు తప్ప నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆమె వాటిని తిరస్కరించిందట. 

 

కాగా ఆ సినిమాల విషయమై నిర్మాతలు ఆమెను ఒకింత బలవంతం చేసారని, అయితే ఎంత పెద్ద హీరోల సినిమాలు అయినప్పటికీ ఒక గ్లామర్ డాల్ లాగా మనసు చంపుకుని నటించడం తన వల్ల కాదని, మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లోనే తాను నటిస్తానని ఆ బడా నిర్మాతలకు తెగేసి చెప్పిందట సాయి పల్లవి. అయితే ఆ నిర్మాతలు ఎవరు, ఆమె ఏ హీరోల సినిమాలు తిరస్కరించింది అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందని వినికిడి. కాగా ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: