టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఛలో సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, మొదటి సినిమాతోనే మంచి అందం, అభినయంతో నటిగా మంచి పేరు దక్కించుకుంది. ఆ తరువాత యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందంలో ఛాన్స్ కొట్టేసిన ఈ కన్నడ భామ, ఆ సినిమాతో ఏకంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి ఏదైనా సరే సూటిగా మాట్లాడే అలవాటు ఉన్న రష్మిక, రక్షిత్ శెట్టితో తన నిశ్చితార్ధం తరువాత పెళ్లి బ్రేకప్ కావడంపై స్పందిస్తూ, లైఫ్ లో ఏది జరిగినా అది మన మంచికే అని అనుకొని ముందుకు సాగాలని, ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే పూర్తిగా ఉందని అన్నారు. ఇక ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ, తనకు కెరీర్ పరంగా వచ్చిన సినిమాలు చాలావరకు మంచి సక్సెస్ సాదించడంతో తనకు ప్రస్తుతం విరివిగా అవకాశాలు వస్తున్నాయని, నిజానికి తనకు ఫ్లాప్ లభించినా, 

 

లేదా హిట్ లభించినా రెండు ఒకటే అని, ఎందుకంటే ఏదైనా మన చేతుల్లో ఉండదని, కాబట్టి ఫ్లాప్ వస్తే కృంగిపోయి, హిట్ వస్తే పొంగిపోవడాన్ని తాను పెద్దగా లక్ష్య పెట్టనని అంటోంది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ గారితో కలిసి నటిస్తున్న సరిలేరు నీకెవ్వరులో తన క్యారెక్టర్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో మహేష్ బాబు నుండి కెరీర్ పరంగా ఎన్నో విషయాలు తాను ఈ సినిమా ద్వారా నేర్చుకున్నానని అంటోంది. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి సక్సెస్ సాదిస్తుందని అంటోంది రష్మిక.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: