ఒక్క హిట్ ఇస్తే చాలు స్టార్‌ హీరోలు కూడా ఆ దర్శకుడి వెంటేపడతారు. ఇది మన హీరోల, నిర్మాతల్ స్ట్రాటజీ. ఈ మధ్య గత కొంత కాలంగా కంటెంట్‌ ప్రధానంగా సాగే సినిమాలను తెరకెక్కించే దర్శకులకు మంచి డిమాండ్‌ పెరిగింది. తాజాగా అదే లిస్ట్‌లోకి మరో కోలీవుడ్ దర్శకుడు చేరాడు. ఓ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌తో ఇండస్ట్రీని చేసిన తమిళ దర్శకుడి కోసం తెలుగు స్టార్‌ హీరోలు కూడా అతని తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్టుగా తాజా సమాచారం. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ తరువాత ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట చరణ్‌. ఇటీవల బ్లాక్‌ బస్టర్‌ హిట్ ఇచ్చిన ఓ తమిళ దర్శకుడితో చరణ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్ లో కొత్తగా టాక్ మొదలైంది.

 

కార్తీ హీరోగా ఇటీవల కమర్షియల్ సక్సస్ సాధించిన తమిళ సినిమా ఖైదీ. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సౌత్ స్టార్‌ హీరోలు ఈ సినిమా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ వెంటపడుతున్నారట.

 

ఖైదీ తరువాత లోకేష్‌.. కోలీవుడ్‌ టాప్ హీరో విజయ్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్‌తోనూ లోకేష్‌ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాల తరువాత లోకేష్‌తో సినిమా చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇప్పటికే లోకేష్‌తో చర్చలు కూడా జరిపాడన్న టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఇక ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ నెక్ట్స్ సినిమా అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ముందుగా వంశీ సినిమా పట్టా లెక్కుతుందా లేక లోకేష్‌ సినిమా పట్టా లెక్కుతుందా తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మొత్తానికి చరణ్ కోలీవుడ్ దర్శకుడి మీద ఆసక్తి చూపడం పలువురు టాలీవుడ్ దర్శకులకు మింగుడు పడటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: