స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా చివరిదశలోనే ఉంది.. షూటింగ్ పూర్తి కాలేదు. సెకండ్ హాఫ్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ సాగుతోందట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి పలు రకాల వార్తలు ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

 

అవేంటంటే... ఈ సినిమా షూటింగ్ లొకేషన్ కు అల్లు అరవింద్ గారు వస్తున్నారట. దీంతో త్రివిక్రమ్ తనకు క్రియేటివ్ స్పేస్ దక్కడం లేదని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. హారిక హాసిని బ్యానర్లో త్రివిక్రమ్ కు ఎప్పుడూ ఫ్రీ హ్యాండేనని అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ ఏం చెప్తే అదే జరుగుతుంది. అయితే ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ తో కలిసి గీతా ఆర్ట్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పైగా 'నాపేరు సూర్య' లాంటి ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అల అన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో అరవింద్ గారు షూటింగ్ ను కాస్త క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారట. ఇది త్రివిక్రమ్ కు ఇబ్బందిగా మారుతోందనే గుసగుసలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. 

 

ఇదొక్కటే కాదట త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఎప్పుడూ కొంచెం లేటు అవుతుందనే సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలోకి వస్తున్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్వరగా పూర్తి చేయాలని.. రిలీజ్ డేట్ ఎటువంటి పరిస్థితిలో మిస్ కాకూడదని నిర్మాతలు త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారట. ఇవన్ని త్రివిక్రమ్ కి కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయట. ఇక అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి మంచి సక్సస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇద్దరు ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: