బన్నీ హీరోగా నటిస్తున్న అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం. సినిమా బాగా వచ్చిందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు సినిమాపై ఒక విషయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య మాటల యుద్ధం నడిచినట్లు సమాచారం. సినిమా పూర్తి అయిన తరువాత రన్ టైం చూస్తే 3 గంటలకు పైగా వచ్చిందని సమాచారం. 

 

సినిమా రన్ టైం 3 గంటలకు పైగా ఉంటే ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఇదే విషయం గతంలోనూ నిరూపితం అయింది. అల్లు అర్జున్ గత సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రన్ టైం దాదాపుగా 3 గంటలు ఉండడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఊహించినంత విజయం అందుకోలేదు, కేవలం రన్ టైం వల్ల సినిమా నష్టపోయింది. ఇక అల వైకుంఠపురంలో సినిమా రన్ టైం కూడా మూడు గంటలకు పైగా రావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. 

 

ఇదే విషయం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య చర్చకు వచ్చినట్లు తెలిస్తోంది. బన్నీ తన సినిమా రన్ టైం ఎట్టి పరిస్థితుల్లో 2.30 గంటలకు  మించవద్దని త్రివిక్రమ్ కు చెప్పారని సమాచారం. దీనికి త్రివిక్రమ్, సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు కానీ, ఫైట్లు కానీ ఏమీ లేవని చెప్పారని సమాచారం. మూడు గంటలకు పైగా వచ్చిన రన్ టైంను అలాగే కొనసాగించాలి అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బన్నీ అభ్యంతరం తెలుపగా, త్రివిక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేసారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమా రన్ టైం ఒక కొలిక్కి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సినిమా రీరికార్డింగ్ పనులు మొదలుపెడతారు అని సమాచారం. అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: