వెండితెరపై ఒక్కసారి కనిపించాలని ఎంతో కనీసం బుల్లితెరపై ఛాన్సు వచ్చినా తమకు సెలబ్రెటీ హోదా వస్తుందని ఎంతో మంది ఔత్సాహిక నటులు ఉంటారు.  అయితే మరికొంత మంది మోడలింగ్ చేస్తూ సినిమాల్లో ట్రై చేస్తుంటారు..ఇప్పుడు ఇది ట్రెండ్ గా సాగుతుంది. ఏది ఏమైనా వెండి తెరపై తమ బొమ్మ కనిపిస్తే తమ కల నెరవేరినట్టే అని భావించేవారు.. తమ కల నెరవేరిన తర్వాత సరైన అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. తాజాగా వంటల ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ చనిపోయి కనిపించింది.

 

సాధారణంగా మామూలు వ్యక్తులెవరైనా అనుమానాస్పద స్థితిలో చనిపోతే... అందుకు కారణాలేంటన్నది పోలీసులు గంటల వ్యవధిలోనే చెప్పేయగలరు. కానీ చనిపోయింది ఒక సెలబ్రెటీ కావడంతో పోలీసులు అన్ని వ్యవహారాలు చాలా గోప్యంగా ఉంచుతాను.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు అనౌన్స్ చేస్తారు.  జాగీ జాన్ ఆ ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటోంది. ఓ టీవీలో ఆమె జాగీస్ కుక్ బుక్ ఆన్ రోజ్ బౌల్ పేరుతో ఓ వంట షో నిర్వహిస్తోంది. బ్యూటీ, పర్సనాల్టీ షోలను కూడా చేస్తోంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అంజేసింది.జాగీ జాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు.

 

జాగీజాన్ అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆమె పోస్టుమార్టం తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉంది. జాగీ జాన్ చనిపోయిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జాగీ జాన్ మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: