యువ సామ్రాట్ నాగ చైతన్య ,సెన్సిబుల్  డైరెక్టర్  శేఖర్ కమ్ముల ,ఫిదా ఫేమ్ సాయి పల్లవి కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం  లవ్ స్టోరీ (వర్కింగ్ టైటిల్).  క్రేజీ  కాంబినేషన్ లో  వస్తున్న  సినిమా కావడంతో  షూటింగ్ స్టార్ట్  ముందు నుండే ఈచిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల  ఈచిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్ రెస్పాన్స్  ను తెచ్చుకోవడం తో  ఈ సినిమా ను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు   విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు.  ఈచిత్రం యొక్క షూటింగ్  ప్రస్తుతం  నిజామాబాద్ జిల్లాలోని  ఆర్మూర్   గ్రామంలో  జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో లీడ్ పెయిర్ పై కొన్ని కీలక సన్నివేశాలను  చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో   నాగ చైతన్య  తల్లిగా  సుస్వాగతం  ఫేమ్  దేవయాని  నటిస్తుండగా సాయి పల్లవికి తల్లిగా  సీనియర్ నటి ఈశ్వరి రావు  కనిపించనుంది.  బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా  తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్ ,  రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడు  పవన్  సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 2 న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇక  వరస పరాజయాలతో  సతమతమైన   నాగ  చైతన్య  ఎట్టకేలకు ఈఏడాది  బ్యాక్ టు బ్యాక్ హిట్లు  కొట్టాడు. అందులో  భాగంగా సమ్మర్ లో  మజిలీ తో ప్రేక్షకుల ముందుకు రాగ ఆ సినిమా  సూపర్ హిట్ అయ్యింది.  ఇక  ఈసినిమా తరువాత  ఇటీవల  వెంకీ మామ  తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. మల్టీ స్టారర్  గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటించగా  ప్రస్తుతం ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద  డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.  మరి  ఈ లవ్ స్టోరీ తో చైతన్య  కెరీర్ లో మొదటి  సారి హ్యాట్రిక్ విజయాలను సాధిస్తాడో  లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: